భారతదేశం, ఏప్రిల్ 14 -- బీహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి భారీ మలుపు తిరిగింది. రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్‌ను కలిసి ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. రాజీనామాకు ముందు రాజ్యాంగ నిబంధనల ప్రకారం తన మంత్రిమండలిని రద్దు చేయాలని నితీష్ కుమార్ గవర్నర్‌కు సిఫార్సు చేశారు. దీనివల్ల రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ నేతృత్వంలో పూర్తిస్థాయి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికి లైన్ క్లియర్ అయ్యింది.

మంగళవారం ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో నితీష్ కుమార్ తన నిర్ణయాన్ని మంత్రులకు వివరించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, "ఇది మా అందరికీ చాలా భావోద్వేగమైన క్షణం. ముఖ్యమంత్రి తన ని...