భారతదేశం, ఆగస్టు 27 -- అన్నాచెల్లెళ్ల అనుబంధానికి చిహ్నంగా నిలిచే రక్షాబంధన్ పండుగ తేదీపై ఉన్న ఉత్కంఠ వీడింది. ఈ ఏడాది శ్రావణ పూర్ణిమ, చంద్రగ్రహణం, భద్ర తదితర యోగాల నేపథ్యంలో రాఖీ ఎప్పుడు కట్టాలనే దానిపై స్పష్టత వచ్చేసింది.

హిందూ సంప్రదాయంలో శ్రావణ పూర్ణిమకు అత్యంత విశిష్టత ఉంది. ఈ పవిత్ర రోజునే దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. సోదరుడి క్షేమం కోరుతూ సోదరి కట్టే రక్షా రేఖ వారి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ ఏడాది శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 27న ఉదయం ప్రారంభమై, ఆగస్టు 28, 2026 ఉదయం వరకు కొనసాగుతుంది. అయితే పండుగ ఆచారాల ప్రకారం ఉదయ తిథి, భద్ర రహిత కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.

శాస్త్ర ప్రకారం పండుగలను ఉదయ తిథిలో ఆచరించడం ఆనవాయితీ. ఆగస్టు 27న పూర్ణిమ తిథితో పాటు చంద్రోదయం ఉండటంతో ఆ ర...