భారతదేశం, జూలై 11 -- రంగారెడ్డి జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే అత్యంత కిరాతక ఘటన వెలుగుచూసింది. ఓ కేసులో ఉన్న వ్యక్తి ఉన్మాదానికి రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు అమాయకులు బలైపోయారు. గతంలో నమోదైన ఒక పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి.. సదరు కేసులోని బాధిత మైనర్ బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులను, ఆపై తన సొంత భార్యాపిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయవలగూడ గ్రామానికి చెందిన రాజు కుమార్ (35) అనే వ్యక్తిపై గతంలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకు వెళ్లిన అతడు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. నాటి నుంచి సదరు బాధిత కుటుంబంపై కక్ష పెంచుకున్న రాజు కుమార్.. శుక్రవారం రాత్రి షాబాద్‌లో నివసిస్తున్న బాలిక ఇంటిపై దాడికి తెగ...