భారతదేశం, మే 9 -- Young advocate custody Incident : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. కోర్టు కార్యకలాపాల్లో చిన్నపాటి లోపం దొర్లిందనే కారణంతో ఒక యువ న్యాయవాదిని 24 గంటల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) వ్యక్తం చేసిన ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)గా నమోదు చేసింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, ఈ కేసు మే 15వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మే 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు ధర్మాసనం ముందు ఒక కేసు విచారణకు వచ్చింది. ఆ సమయంలో ఒక యువ న్యాయవాది ఒక నిర్దిష్ట ఉత్తర్వు కాపీని సమర్పించలేకపోయారు. ఈ చిన్న సాంకేతి...