భారతదేశం, మార్చి 14 -- హైదరాబాద్/బెంగళూరు: సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సగటు భారతీయుడికి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, దానికి తోడు నిత్యావసరాల ధరలు పెరగడం రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఆందోళనలకు దారి తీసింది. భారీ మొత్తంలో హోమ్ లోన్లు తీసుకుని, దశాబ్దాల పాటు ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితుల్లో.. ఇప్పుడు ఇల్లు కొనడం రిస్క్ అని చాలామంది భావిస్తున్నారు.

ప్రస్తుత అస్థిర పరిస్థితుల వల్ల కొనుగోలుదారులు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్త 5 కోట్ల రూపాయల విల్లా కొనాలని భావించి, తాజా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని కొన్ని వారాల పాటు పక్కన పెట్టడమే దీనికి నిదర్శనం.

"ప్రస్తుతం కొనుగోలుదారుల్లో స్ప...