భారతదేశం, ఏప్రిల్ 3 -- 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి గాను తొలి విడతలో 27 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో పలువురు ప్రముఖులకు చోటు కల్పించడం విశేషం.

తెలంగాణ మాజీ గవర్నర్, సీనియర్ నేత తమిళసై సౌందరరాజన్ చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన మైలాపూర్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. అలాగే కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ 'అవినాశి (SC)' స్థానం నుండి పోటీ చేయనున్నారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కోయంబత్తూర్ (నార్త్) నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

(క్రమ స...