భారతదేశం, మే 28 -- దక్షిణ భారతదేశంలోని చాలా కుటుంబాల్లో కుమార్తె మొట్టమొదటి సారి రుతుస్రావం అయినపుడు అదొక వేడుకలా జరుపుకోవడం సంప్రదాయం. మా అమ్మాయి పెద్ద మనిషి అయిందంటూ చుట్టుపక్కల వారిని, చుట్టాలందిరినీ పిలిచి సంబరాలు చేసుకుంటారు. కొన్నిచోట్ల సమర్త అని, మరికొన్ని చోట్ల రుతుకాల సంస్కారం అని, ఇంకొన్ని ప్రాంతాల్లో మంజల్ నీరాట్టు విజా అని ఈ సంప్రదాయ వేడుకకు పేరు.

కానీ దాదాపుగా ఆ మరుసటి రోజే పరిస్థితి తారుమారవుతుంది. వేడుకల్లో సింహాసనంలో కూర్చుని ఆశీర్వాదాలు అందుకున్న అమ్మాయి పైన.. ఆ తర్వాత రుతుస్రావమైన ప్రతిసారీ చాలా నిషేధాలు విధిస్తారు. వంటింటికి రావద్దు, గుడులు గోపురాలకు వెళ్లొద్దు, ఇంట్లో సామాన్లు ముట్టొద్దు. ఇలా అనేక నిషేధాలు ఎదుర్కొంటుంది. అనేక సందర్భాల్లో ఈ నిషేధాలు ఇంటి నుంచి పాఠశాలకూ వ్యాపిస్తాయి. ఇది అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బత...