భారతదేశం, మే 20 -- ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'మెటా'లో ఉద్యోగాల కోత పర్వం కొనసాగుతోంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి దిగ్గజ ప్లాట్‌ఫామ్‌ల మాతృసంస్థ మెటా, ప్రపంచవ్యాప్తంగా తన వర్క్‌ఫోర్స్‌లో మరో 8,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచే ఉద్యోగులకు ఉద్వాసన పలికే ప్రక్రియ మొదలైంది. ముఖ్యంగా సింగపూర్‌లోని ఏసియన్ హబ్ కార్యాలయం నుంచి తెల్లవారుజామున 4 గంటలకే మెయిల్‌ ద్వారా సమాచారం పంపడం చర్చనీయాంశంగా మారింది.

ఈ తాజా లేఆఫ్స్‌లో ప్రధానంగా ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీమ్‌లపై వేటు పడింది. కంపెనీని మరింత సమర్థవంతంగా (Efficiency) తీర్చిదిద్దేందుకు, అనవసరపు ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. అమెరికా, యూరప్ దేశాల్లోని సిబ్బందికి కూడా వారి వారి టైమ్ జోన్‌ల ప్రకారం సమాచారం అందు...