భారతదేశం, జూన్ 7 -- ప్రకృతి వైవిధ్యానికి, మానవ జీవనశైలికి ఉన్న అవినాభావ సంబంధానికి 'మృగశిర కార్తె' ఒక అద్భుత నిదర్శనం. ప్రతి ఏటా జూన్ నెలలో వచ్చే ఈ కార్తె కోట్లాది మంది ప్రజల ఆహార అలవాట్లలో ఒక పెద్ద మార్పును తెస్తుంది. ఆ రోజున ఇళ్లలో కచ్చితంగా చేపల కూర వండటం లేదా చేప ప్రసాదం తీసుకోవడం ఒక ఆనవాయితీ. అసలు ఏటా మృగశిర కార్తె రోజునే ఎందుకు చేపలు తినాలి? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి, ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

రోహిణి కార్తెలో సూర్యుడి ప్రతాపానికి భూమి విపరీతంగా వేడెక్కుతుంది. ఆ తర్వాత వచ్చే మృగశిర కార్తెతో రుతుపవనాలు ప్రవేశించి, ఆకాశం మేఘావృతమై తొలి వర్షాలు పడతాయి. ఈ సమయంలో వాతావరణం ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది.

వేడి వాతావరణం నుంచి ఒక్కసారిగా చల్లని వాతావరణంలోకి మారే ఈ సంధి కాలంలో మానవ శరీరంలో 'వాత, పిత్త, కఫ' దోషాలలో అ...