భారతదేశం, జూన్ 7 -- మృగశిర కార్తె ప్రవేశంతో వాతావరణంలో మార్పులు ఉంటాయి. ఈ ఆకస్మిక మార్పు వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి, కఫం, జలుబు, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షించుకోవడానికి చాలా మంది చేపలను తింటారు. అయితే ఆధ్యాత్మిక కారణాల వల్ల లేదా అలవాటు లేకపోవడం వల్ల చేపలు తినని శాకాహారులు మృగశిర రోజున కచ్చితంగా కొన్ని ప్రత్యామ్నాయ ఆహారాలను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

చేపలు తినని వారు మృగశిర కార్తె రోజున ఉదయాన్నే అల్లం (లేదా శొంఠి పొడి), బెల్లం కలిపి తీసుకోవడం తరాల నాటి ఆచారం. అల్లం, శొంఠిలలో సహజంగానే శరీరంలో వేడిని పుట్టించే గుణం ఉంటుంది. ఇది శీతల వాతావరణం వల్ల శరీరంలో కఫం చేరకుండా చూస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, వర్షాకాలపు జలుబు, దగ్గుల నుండి...