భారతదేశం, మార్చి 5 -- ఎలాంటి విధ్వంసం లేకుండా కూడా మూసీని సుందరీకరణ చేయవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటికి నష్టం జరగకుండా మూసీని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఇవాళ నాగోల్ ప్రాంతంలో మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధిని కేటీఆర్ పరిశీలించారు. మూసీ ప్రణాళికలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న బాధితులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూసీ ప్రాజెక్టు పేరిట లక్షన్నర ఇళ్ల కూల్చివేతకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. "పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపితే బీఆర్‌ఎస్ అడ్డుకుంటుంది. మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ జరుగుతోంది. రూ. 16 వేల కోట్ల ప్రాజెక్టును లక్షన్నర కోట్లకు పెంచే కుట్ర చేస్తున్నారు. మూసీ అభివృద్ధి పేరుతో వేల కోట్ల అవినీతి ప్రయత్...