భారతదేశం, జూన్ 14 -- విద్యా రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ములుగులో ఉన్న ప్రతిష్టాత్మక సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (SSCTU) 2026-27 విద్యాసంవత్సరానికి గానూ వివిధ విభాగాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

యూనివర్సిటీ డీన్ (అకడమిక్స్) ప్రొఫెసర్ జి. రాంరెడ్డి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్ నేతృత్వంలో ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ విద్యాసంవత్సరం నుండి ఐఐటీ హైదరాబాద్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వంటి దేశీయ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల భాగస్వామ్యంతో కొత్త టెక్నికల్, హ్యుమానిటీస్ కోర్సులను ఇక్కడ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కింది విభాగాల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

కంప్యూ...