భారతదేశం, జనవరి 2 -- రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా. త్వరలో ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది.

రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి పరిధిలోని మున్సిపల్, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్లోనూ ఈ వివరాలను ఉంచారు.

117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో కలిపి 45 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు, 500 మంది థర్డ్​జెండర్లు​ ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ఓటర్ల ముసా...