భారతదేశం, మే 20 -- చాంద్రమానానికి, సౌరమానానికి మధ్య ఉండే 11 రోజుల వ్యత్యాసాన్ని సరి చేయడానికి మూడేళ్లకు ఒకసారి అధికమాసం వస్తుంది. ఈ ఏడాది మే నెలలో అధికమాసం వచ్చింది. ఇది అధిక జ్యేష్ఠ మాసం. ప్రతి మూడు సంవత్సరాలకు వచ్చే ఈ అధికమాసం అనేది చాలా విశేషమైనది. మే 17 నుంచి ఈ అధిక జ్యేష్ఠ మాసం మొదలైంది. జూన్ 16 నుంచి నిజ జ్యేష్ఠ మాస. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం లేదా మలమాసం అని కూడా అంటారు.

అధిక మాసంలో దానధర్మాలు చేస్తే విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే అవసరమైన వారికి ఆహారం, ధనం, వస్త్రాలు వంటివి ఇస్తే కృష్ణుని అనుగ్రహం కలిగి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం లభిస్తాయి.

ఈ నెలలో భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో చేసే పూజలు, దానాలు కుటుంబ సభ్యులందరికీ శుభ ఫలితాలను అందిస్తాయి. అధిక మాసంలో ఏ రాశి వారు వేటిని దానం చేయాలో ఇప్...