భారతదేశం, ఫిబ్రవరి 17 -- ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, జేఎన్‌టీయూ వర్సిటీ వీసీ కిషన్‌కుమార్‌, రెక్టార్ విజయ్‌కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావుతోపాటుగా పలువురు అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు.

టీజీ ఈఏపీసెట్ అప్లికేషన్స్ సహా.. పరీక్షల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా.. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్టుగా జెఎన్‌టీయూ రెక్టార్ విజయ్‌కుమార్ రెడ్డి చెప్పారు. 'ఈ ఏడాది మెుదటిసారిగా మెుబైల్ ద్వారా ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రిలిమినరీ మార్కులు స్క్రీన్‌పై డిస్‌ప్లే అయ్యేలా చూస్తాం. దీంతో విద్యార్థులు ఫలితాలు వచ్చేదాకా ఎదురుచూడకుండా.. గతేడాది ర్యాంకులతో పోల్చి తమకు సుమారు...