భారతదేశం, జూన్ 10 -- న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను తిరస్కరించడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు బుధవారం దిల్లీలో ఈసీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నామినేషన్ రద్దును పూర్తిగా చట్టవిరుద్ధం, ఏకపక్షం అని కాంగ్రెస్ ఎంపీలు అభిషేక్ మను సింఘ్వీ, కేసీ వేణుగోపాల్ తీవ్రంగా ఖండించారు.

సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడారు. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఆయన స్పష్టం చేశారు.

"చట్టప్రకారం ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసూ లేదు, రుజువూ కాలేదు. అలాంటప్పుడు అఫిడవిట్‌లో దేని గురించి వెల్లడించాలి? ఇదంతా కేవలం ఒక అపోహతో రిటర్నింగ...