భారతదేశం, మార్చి 26 -- మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ఈ బస్సులో సుమారు 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. 15 మంది గాయపడగా. వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే ప్రమాదం జరిగిన క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా చెలరేగినట్లు తెలిసింది.

ప్రాథమిక సమచాారం మేరకు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో జరిగింది. పలకల క్వారీల బస్సు మలుపు తిరుగుతుండగా టిప్పర్‌ ఢీకొట్టినట్లు తెలిసింది. బస్సు వెనుక భాగంలో ఉన్నవారే ఎక్కువగా చనిపోయారు. ముందు భాగంలో ఉన్న సుమారు 10 మంది ప్రాణాల...