భారతదేశం, జనవరి 5 -- మలయాళ చిత్ర పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఇదివరకు పాపులర్ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నటుడు, సీనియర్ ప్రొడక్షన్ కంట్రోలర్ కన్నన్ పట్టాంబి (62) ఆదివారం (జనవరి 4) రాత్రి కన్నుమూశారు.

గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కన్నన్ పట్టాంబి కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. జనవరి 4వ తేదీ రాత్రి 11:40 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ కన్నన్ పట్టాంబి తుదిశ్వాస విడిచారు.

ఈ విషాద వార్తను ఆయన సోదరుడు, ప్రముఖ దర్శకుడు మేజర్ రవి ధృవీకరించారు. దీంతో మలయాళ సినీ లోకం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తమ కుటుంబంలో జరిగిన ఈ పెద్ద నష్టాన్ని తట్టుకోలేక మేజర్ రవి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. "నా ప్...