భారతదేశం, మార్చి 14 -- మిడిల్ ఈస్ట్ లో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు నేరుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను దిగ్బంధించడంతో ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడి, దేశంలో ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ సంక్షోభం సినీ సెట్‌లకు పాకడంతో షూటింగ్‌లు సజావుగా సాగడం కష్టతరంగా మారింది.

ఎల్‌పీజీ కొరత వల్ల కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (KFPA) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సుమారు 18 మలయాళ సినిమాలు నిలిచిపోయే ప్రమాదంలో ఉన్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు బి. రాకేశ్ తెలిపారు. సెట్స్‌లో పనిచేసే వందలాది మంది సిబ్బందికి భోజన వసతి కల్పించడం ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్‌లకు పెద్ద సవాలుగా మారింది.

"మా దగ్గర మరో రెండు రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే ఉంది. ఈ ...