భారతదేశం, జూన్ 15 -- మనిషి పుట్టినప్పటి నుంచి మరణం దాకా మొత్తం 16 సంస్కారాలు ఉంటాయి. ఇందులో అంతిమ సంస్కారాలు అనేవి కీలకమైనవి. చనిపోయిన తర్వాత వ్యక్తి శరీరం నుంచి ప్రాణం వెళ్లిపోయాక వెంటనే వారి ముక్కు, చెవులలో దూదిని పెడతారు. అసలు ఎందుకు ఇలా చేయాలి? మరణం తర్వాత చెవుల్లో, ముక్కులో ఎందుకు దూది పెడతారు? దీని వెనక కారణాలు ఏంటో తెలుసుకుందాం.

గరుడ పురాణం, శాస్త్ర దృక్పథం ప్రకారం దీని వెనక పలు కారణాలు ఉన్నాయి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మన శరీరం 9 ద్వారాలతో నిర్మితమై ఉంటుంది. రెండు కళ్ళు, రెండు నాసికా రంధ్రాలు, రెండు చెవులు, నోరు, మలమూత్ర విసర్జన అవయవాలు ఇలా మొత్తం తొమ్మిది ద్వారాలు ఉంటాయి. మరణ సమయంలో ఆత్మ ఈ ద్వారాలలో ఏదో ఒకదాని ద్వారా శరీరాన్ని వదిలి వెళ్తుందని పురాణాలు చెబుతున్నాయి.

చనిపోయిన వెంటనే ఆత్మకు శరీరంపై ఉన్న మమకారం పూర్తిగా పోదని న...