భారతదేశం, మార్చి 25 -- ఇరాన్‌తో సాగుతున్న పోరులో అమెరికా తన దూకుడును పెంచింది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ విధిస్తున్న ఆంక్షలను, అడ్డంకులను తొలగించేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా సైన్యంలోని అత్యంత శక్తివంతమైన '82వ ఎయిర్‌బోర్న్ డివిజన్'కు చెందిన సుమారు 2,000 మంది సైనికులను మధ్య ప్రాచ్యానికి తరలించాలని వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకుంటున్న 5,000 మంది మెరైన్ దళాలకు అదనంగా ఈ పారాట్రూపర్లు తోడవనున్నారు. యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధి మూతపడటంతో, దానిని తిరిగి తెరిపించడమే లక్ష్యంగా అమెరికా ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది.

ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్న 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ సామాన్యమైనది కాదు. ప్రపంచంలో ఎక్కడైనా సరే, కేవలం 18 ...