భారతదేశం, ఫిబ్రవరి 13 -- వాషింగ్టన్/టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇరాన్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక (Aircraft Carrier) 'యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్. ఫోర్డ్' (USS Gerald R. Ford)ను అమెరికా మధ్యప్రాచ్యానికి పంపింది. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ఇరాన్‌తో చర్చలు జరుపుతూనే, మరోవైపు సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలిస్తుండటం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది.

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ప్రస్తుతం కరేబియన్ సముద్రంలో ఉన్న ఈ భారీ యుద్ధనౌకను వెంటనే మధ్యప్రాచ్యానికి వెళ్లాలని అమెరికా రక్షణ శాఖ ఆదేశించింది. ఇది అక్కడ ఇప్పటికే ఉన్న 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' స్ట్రైక్ గ్రూప్‌తో పాటు మూడు గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లతో చేరనుంది. ఈ భారీ యుద్ధనౌక కన...