భారతదేశం, ఫిబ్రవరి 17 -- అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఘోరం జరిగింది. కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక శవంగా కనిపించింది. పొరుగువారి ఇంటి ముందు డ్రమ్ములో విగతజీవిగా పడి ఉంది. పక్కింటి కులవర్ధన్ అనే వ్యక్తి ఇంట్లో డ్రమ్ములో మృతి చెంది కనిపించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా మదనపల్లెలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియ దారుణంగా హత్య చేశారు. సోమవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కలవారు కూడా బాలిక కోసం వెతికారు. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కీలక విషయం తెలుసుకున్నారు.

బాలిక మిస్సింగ్‌తో పోల...