భారతదేశం, సెప్టెంబర్ 13 -- మంత్రివర్గం నుంచి తొలగించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ స్పందించారు. పదవి పోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదని, కానీ ఎటువంటి కారణం లేకుండా తొలగించడం మాత్రం మనస్తాపానికి గురిచేసిందని పేర్కొన్నారు. బర్తరఫ్ వేటు పడిన అనంతరం వరంగల్‌లో తొలిసారిగా తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో కొండా దంపతులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాల్లో అవకాశవాదం ఎక్కువైపోయిందని విమర్శించారు. పదవుల కంటే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎంపీపీ స్థాయి నుంచి మంత్రి పదవి వరకు ఎదిగానని, గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కోసం ఎలాంటి ఆలోచన లేకుండా పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు.

ఉదయం ఒక పార్టీలో ఉండి మధ్యాహ్నానికి మరో పార్టీ కండువా కప్పుకునే సంస్కృతి...