మండుతున్న తెలంగాణ.. భానుడి భగభగలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
భారతదేశం, మే 23 -- ఉత్తర తెలంగాణవ్యాప్తంగా సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రత అగ్నికీలలను తలపిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో వరుసగా రెండో రోజు కూడా ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. ఏకంగా 244 మండలాలు తీవ్రమైన వేడి గాలలు ప్రభావంతో ఉడికిపోయాయి. శుక్రవారం నమోదైన గణాంకాల ప్రకారం సూర్యాపేట జిల్లా అత్యధికంగా 22 మండలాల్లో వడగాలుల బారిన పడింది.
శుక్రవారంనాడు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి)లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు 16 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46.2 నుండి 46.5 డిగ్రీల మధ్య నమోదై ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో వడదెబ్బతో వివిధ ప్రాంతాల్లో మెుత్తం 34 మంది మరణించారు.
సాధారణంగా ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా, సూర్యాస్తమయం తర్వాత చల్లటి గాలులు వీచి కాస్త ఉపశమనం లభిస్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.