భారతదేశం, జూలై 4 -- తెలుగు రాష్ట్రాల్లో ఏ పల్లెకు వెళ్లినా ప్రజలు ముందుగా చెప్పే సమస్యల్లో భూములకు సంబంధించిన వివాదాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. తెలుగు గ‌డ్డపై గత మూడు దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారినా, భూముల సమస్యలకు మాత్రం శాశ్వత పరిష్కారం దొరకడంలేదు. పాలకులు మారుతున్నారు, విధానాలు మారుతున్నాయి, పేర్లు మారుతున్నాయి. కానీ రైతుల భూములకు సంబంధించి సమస్య తీరకపోగా కొత్త సమస్యలు పుట్టుకురావ‌డం దుర‌దృష్టక‌రం.

ఆధునిక సాంకేతికతతో భూముల వివరాల డిజిటలైజేషన్ ప్రారంభించిన తర్వాత భూ రికార్డుల్లో పారదర్శకత పెరుగుతుందని రైతులు భావించారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఇబ్బందులు పెరిగి చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా నష్టపోయినట్లు అనేక గ్రామాల్లో వినిపిస్తున్న అభిప్రాయం. భూ రికార్డుల్లో తప్పులు, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, రాజకీయ నాయకుల జోక్యం కలిసి ...