భారతదేశం, మార్చి 3 -- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం మండలం చింతకాని గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక వాగులో విష్ణువు విగ్రహం బయటపడింది. నిజానికి ఈ విగ్రహం మూడు సంవత్సరాల కిందటే కనిపించింది. అప్పట్లో చేపలు పట్టేందుకు వెళ్లినవారు చూశారు. కొన్ని రోజులు పూజలు చేశారు. తర్వాత అలాగే వదిలేయడంతో ఇసుకలో కూరుకుపోయింది.
మళ్లీ ఈ ఏడాది తాజాగా కొన్ని రోజుల కిందట కొంతమందికి విగ్రహం తల భాగం కనిపించింది. దీంతో ఈ విషయం మరోసారి బయటకు వచ్చింది. విగ్రహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత చింతకాని, జగ్గయపల్లి గ్రామస్థులు విగ్రహాన్ని బయటకు తీశారు. అయితే విగ్రహంపై రెండు గ్రామాల ప్రజల మధ్య చర్చ నడిచింది. విగ్రహం తన చేను దగ్గరలో బయట పడిందని, ఆలయ నిర్మాణానికి స్థలం ఇస్తానని ఓ రైతు చెప్పాడు. ఈ విగ్రహ రూపాన్ని బట్టి కాకతీయుల కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.