Andhrapradesh, ఆగస్టు 18 -- రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌తో సోమవారం సచివాలయంలో సమీక్షించారు. అల్పపీడనం వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సీఎస్‌(ప్రధాన కార్యదర్శి)కు సూచించారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పలుచోట్ల నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం, కొండప్రాంతాలు కోతలకు గురికావడంతో అధికారులు ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రజలకు సమాచారం అందించేలా అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని... అన్న...