భారతదేశం, జూన్ 30 -- పసిడి ప్రేమికులకు ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, యూఎస్ డాలర్ పుంజుకోవడంతో దేశీయ కమోడిటీ మార్కెట్ (MCX)లో మంగళవారం ఉదయం బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. జూన్ 30 మంగళవారం ఉదయం 9:10 గంటల ప్రాంతంలో ఎంసీఎక్స్ ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ 1.28 శాతం క్షీణించి, 10 గ్రాములకు రూ.1,40,574 వద్ద ట్రేడవుతోంది. దీంతో ధర దాదాపు రూ.1,40,500 సమీపానికి చేరింది. అదే సమయంలో ఎంసీఎక్స్ సెప్టెంబర్ సిల్వర్ కాంట్రాక్టులు సైతం 1.04 శాతం నష్టపోయి కేజీ రూ.2,20,322 పలుకుతోంది.

పసిడి ధరలు ఇంత వేగంగా పతనమవడానికి ప్రధాన కారణం డాలర్ ఇండెక్స్ పెరగడమేనని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడంతో, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది మరో మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనా...