భారతదేశం, ఆగస్టు 31 -- భారతీయ వాహన మార్కెట్లో వేగంగా పుంజుకుంటున్న ఎస్‌యూవీ సెగ్మెంట్‌పై జపనీస్ కార్ల తయారీ దిగ్గజం 'హోండా కార్స్ ఇండియా' ప్రత్యేక దృష్టి సారించింది. దేశీయంగా విపరీతమైన డిమాండ్ ఉన్న సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 2028 నాటికి సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్లు హోండా అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం విపణిని శాసిస్తున్న మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో వంటి దిగ్గజ మోడళ్లకు ఇది నేరుగా పోటీ ఇవ్వనుంది.

2030 నాటికి భారతదేశంలో మొత్తం 10 కొత్త మోడళ్లను ఆవిష్కరించాలనే వ్యూహాత్మక ప్రణాళికలో ఈ కొత్త ఎస్‌యూవీ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కంటే ముందే '0 ఆల్ఫా' (0 Alp...