భారతదేశం, ఫిబ్రవరి 16 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇంట్లో ట్రస్ట్, సగం ఆస్తి గురించి వాదనలు జరుగుతూనే ఉంటాయి. అందరిని ఆపి తమ ఇష్టపూర్వకంగా చేస్తున్నామని, ట్రస్ట్ అనేది తాతయ్య కల, అది నిజం చేయనివ్వండని కావ్య వేడుకుంటుంది. మాకు ఎలాంటి నష్టాలు వచ్చిన దుగ్గిరాల ఇంటి పేరు శాశ్వతంగా ఉండిపోవాలని, అంతా సహకరించాలని కావ్య అంటుంది.

ఆపండి మీ నాటకాలు అని అరుస్తుంది ధాన్యలక్ష్మీ. ట్రస్ట్ అని, దానం అన్నారు. నా కొడుకు పేరు మీద ఆస్తి రాసినట్లు నటించి నా కడుపు మీద తన్నారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇక్కడ ఆస్తి పేపర్స్ నా చేతిలో పెడుతూ అక్కడ నా కొడుకు, కోడలిని నాశనం చేస్తున్నారా. అప్పు, కల్యాణ్ కిడ్నాప్ అయ్యారని వీడియో చూపిస్తుంది ధాన్యలక్ష్మీ.

అందులో రౌడీలను వీళ్లను విడిచిపెట్టకూడదు అని రాజ్ సర్ చెప్పారని అంటారు. దాంతో రాజ్, కావ్యను నిందిస్తుం...