భారతదేశం, జూన్ 1 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రేఖ టెన్షన్ పడుతుంటే భూషణ్ వచ్చి స్లీపింగ్ పిల్స్ తెచ్చినట్లు, ఉదయం పదింటి వరకు లేవడని చెబుతాడు. గట్టిగా చెబితే అయిపోయేదానికి ఈ ట్యాబ్లెట్స్ ఇదంతా ఎందుకు అని భూషణ్ అడుగుతాడు.

నిజమే. కానీ, శోభనం జరిపించమని ఇందు కోరింది. తనకు రాజు అంటే ఇష్టం లేదు. కానీ, నానమ్మ వాళ్లు బాధపడకూడదని వాళ్ల కోసంస ఫస్ట్ నైట్‌కు ఒప్పుకుంది. అలా అని ఫస్ట్ నైట్ ఒప్పుకోలేదు. జస్ట్ వాడితో గదిలోకి వెళ్లేందుకు ఒప్పుకుంది. ఇందును గుప్పిట్లో పెట్టుకోవాలంటే ఇలాంటివి చేయాలని రేఖ అంటుంది.

మరోవైపు రేఖ ఇచ్చి మత్తు ట్యాబ్లెట్ చేతిలో పట్టుకున్న భ్రమరాంబ ఇది పాలల్లో వేయమని ఇచ్చావ్. కానీ నేను వేయనుగా. వాడు గుర్రుపెట్టి నిద్రపోయే ట్యాబ్లెట్ కాదు గుర్రంలా పరుగెత్తే ట్యాబ్లెట్ నేను ఒకటి తీసుకొచ...