భారతదేశం, మే 18 -- "బెయిల్ మంజూరు చేయడం అనేది ఒక సాధారణ పద్ధతి.. జైల్లో ఉంచడం అనేది కేవలం ఒక అసాధారణ చర్య మాత్రమే" అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సయ్యద్ ఇఫ్తికార్ ఆండ్రాబీ అనే వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 2020 నుంచి అంటే దాదాపు ఆరేళ్లుగా ఒక వ్యక్తి విచారణ ఖైదీగా జైల్లోనే ఉండటంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

గతంలో ఉమర్ ఖలీద్ వంటి వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన తీరును ప్రస్తుత ధర్మాసనం తప్పుబట్టింది. ముఖ్యంగా 'గుల్ఫిషా ఫాతిమా' కేసులో బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పు సరికాదని పేర్కొంది. "రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం ప్రతి వ్యక్తికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. యూఏపీఏ చట్టం ఆ హక్కును పూర్తిగా కాలరాయలేదు. ...