భారతదేశం, మే 1 -- మే 4న వెలువడనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఓట్ల లెక్కింపునకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో.. అటు రాజకీయంగా, ఇటు న్యాయపరంగా మమతా బెనర్జీకి మూడు ప్రధాన సవాళ్లు ఎదురయ్యాయి.

తృణమూల్ కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న ప్రధాన అంశం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. దాదాపు 15 ఏళ్లుగా బెంగాల్‌ను పాలిస్తున్న మమత కోటకు ఈసారి బీటలు పడతాయని మెజారిటీ సంస్థలు జోస్యం చెప్పాయి.

మాట్రిజ్ (Matrize): బీజేపీకి 146-161 సీట్లు, టీఎంసీకి 125-140 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

పీ-మార్క్ (P-Marq): బీజేపీకి 150-175 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

పోల్ డైరీ: బీజేపీ స్పష్టమైన విజయం సాధిస్తుందని (142-171 సీట్లు) విశ్లేషించింది....