భారతదేశం, ఏప్రిల్ 2 -- బెంగళూరు నగరంలో అత్యంత హృదయవిదారకమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం కొన్ని నిమిషాల అజాగ్రత్త ఒక పసిప్రాణాన్ని బలితీసుకోగా, ఆ ఘోరాన్ని జీర్ణించుకోలేక కన్నతల్లి కూడా తనువు చాలించింది. బకెట్‌లోని నీటిలో పడి 11 నెలల చిన్నారి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోగా, ఆ మరుసటి క్షణాల్లోనే ఆ తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ తీవ్ర విషాద ఘటన గురువారం బెంగళూరులోని చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భైరవేశ్వరనగర్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమె ప్రస్తుతం ఇంటి నుంచే విధులు (వర్క్ ఫ్రమ్ హోమ్) నిర్వహిస్తోంది. గురువారం నాడు మేడపై ఆరేసిన బట్టలు తీసుకురావడానికి ఆమె కొన్ని నిమిషాల పాటు పైకి వెళ్లింది. ఆ సమయంలో 11 నెలల చిన్నారిని ఇంట్లోనే ఒంటరిగా వదిలేసింది.

తల్లి లేని ...