భారతదేశం, ఏప్రిల్ 22 -- హిందూ ధర్మంలో వైశాఖ పూర్ణిమకు ఎంతో పవిత్రత ఉంది. ఈ రోజునే బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జన్మించారు. అందుకే దీనిని 'బుద్ధ జయంతి' లేదా 'వైశాఖ పూర్ణిమ' అని కూడా పిలుస్తారు. 2026 సంవత్సరంలో మే 1వ తేదీన బుద్ధుని 2588వ జయంతిని జరుపుకోబోతున్నాం. ఆధ్యాత్మికంగా ఈరోజు కేవలం బుద్ధుడికి మాత్రమే కాదు, అష్టలక్ష్ములకు, చంద్ర దేవుడికి కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున చేసే స్నాన, దానాల వల్ల వంశపారంపర్యంగా వచ్చే దోషాలు తొలగిపోయి, ఇంట్లో సుఖసంపదలు పెరుగుతాయని భక్తుల విశ్వాసం.

హిందూ పంచాంగం ప్రకారం, వైశాఖ శుద్ధ పూర్ణిమ తిథి ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ రాత్రి నుంచే ప్రారంభమవుతుంది.

పూర్ణిమ తిథి ప్రారంభం: ఏప్రిల్ 30, 2026 సాయంత్రం 09:13 గంటలకు.

పూర్ణిమ తిథి ముగింపు: మే 01, 2026 రాత్రి 10:52 గంటలకు.

ముఖ్య గమనిక: ఉదయ తిథి ప్రాధాన్యతన...