భారతదేశం, మే 12 -- తమిళనాడు రాజకీయ యవనికపై కొత్తగా మెరిసిన ధ్రువతార, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌కు ఊహించని చోటు నుంచి భారీ మద్దతు లభించింది. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి మరో 24 గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో, ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేలో చీలిక రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) నాయకత్వాన్ని కాదని మాజీ మంత్రి సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం విజయ్ ప్రభుత్వానికి జై కొట్టింది.

మే 10వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్, బుధవారం (మే 13) అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది. 234 స్థానాలున్న అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమై...