భారతదేశం, ఏప్రిల్ 6 -- నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు తదితరులతో కలిసి ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు.

దక్షిణ భారతదేశంలోని ఏకైక శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రాన్ని పునరుద్ధరించి, తద్వారా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రూ. 225 కోట్లతో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో అధికారులతో బాసర ఆలయ అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించిన ముఖ్యమంత్రి, పనులను 'శాస్త్రాల'కు అనుగుణంగా చేపట్టాలని ఆదేశించారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా విశాలమైన రహద...