భారతదేశం, మార్చి 16 -- ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ఉద్రిక్తతలు పసిడి మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. సోమవారం (మార్చి 16) ఉదయం ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో బంగారం ధరలు ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. అటు అమెరికా-ఇరాన్ యుద్ధం, ఇటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు మదుపర్లలో ఆందోళన పెంచుతున్నాయి.

సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం ఏప్రిల్ ఫ్యూచర్స్ 1.14% మేర క్షీణించి, 10 గ్రాములకు రూ. 1,800 తగ్గి రూ. 1,56,655 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల పరిస్థితి కూడా అలాగే ఉంది. వెండి మే కాంట్రాక్టులు 1.7% పైగా పతనమై, కిలోకు రూ. 4,300 మేర తగ్గడంతో ప్రస్తుతం ధర రూ. 2,55,101 వద్దకు చేరింది.

ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇరాన్ యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించింది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా వాణిజ్యం నిలిచిపోవడంతో ముడి చముర...