ఫిలిప్పీన్స్కు తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు.. వాణిజ్యంపై ఫోకస్!
భారతదేశం, సెప్టెంబర్ 8 -- తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఆ దేశ క్యాబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి. టు లారెల్ జూనియర్తో సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులను పెంచడంతోపాటు తెలంగాణ-ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించే అవకాశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
భారతదేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా అవతరించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. భారీ పరిమాణంలో నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయగల ఉత్పత్తి సామర్థ్యం, ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ, అవసరమైన అనుభవం తెలంగాణకు ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదనపై లారెల్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ నుంచి మరింత ఎక్కువ మెుత్తంలో బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.