భారతదేశం, మార్చి 1 -- ఇరాన్, గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే తెలుగు వారిని తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటుందని చెప్పారు. యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల దృష్ట్యా, అన్ని భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. ఆ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు జారీ చేసిన సలహాలు, హెచ్చరికలను క్రమం తప్పకుండా పాటించాలని కోరారు.

'ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే, అవసరమైతే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తెలుగు ప్రజలను సురక్షితంగా తిరిగి తీసుకువస్తుంది.' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలంగాణ నివాసితుల పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక...