భారతదేశం, ఆగస్టు 26 -- ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని తూత్తుకూడి (టుటికోరిన్ ), ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం మధ్య వారపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలు సెప్టెంబర్ 7, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు అందుబాటులో ఉంటాయి.

రైలు నంబర్ 06018 (తూత్తుకూడి - నరసాపురం వారపు ప్రత్యేక రైలు) : ఈ రైలు సెప్టెంబర్ 7, 2026 నుండి సెప్టెంబర్ 28, 2026 వరకు ప్రతి సోమవారం రాత్రి 23:30 గంటలకు తూత్తుకూడిలో బయలుదేరి, మరుసటి రోజు (మంగళవారం అర్ధరాత్రి దాటాక) 00:20 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.

రైలు నంబర్ 06017 (నరసాపురం - తూత్తుకూడి వారపు ప్రత్యేక రైలు) : ఈ రైలు సెప్టెంబర్ 9, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు ప్రతి బుధవారం ఉదయం 04:00 గంటలకు నరసాపురంలో బయలుదేరి, మరుసట...