Telangana, ఆగస్టు 1 -- ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది.ఈ మేరకు గురువారం విద్యాశాఖ షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఖాళీలను ప్రకటించి అర్హులైన టీచర్లకు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ మేరకు షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది.

టీచర్ల పదోన్నతుల ప్రక్రియను 10 రోజుల్లో పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆగస్ట్ 2వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఆగస్ట్ 11వ తేదీతో పూర్తి చేయనున్నారు. పదోన్నతుల నిర్ణయంతో 3,867 మంది టీచర్లకు ప్రయోజనం కలనుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....