భారతదేశం, ఆగస్టు 6 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెందిన ఫేస్‌బుక్ వీడియోను ఐదు గంటల పాటు నిలిపివేసిన వ్యవహారంలో సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' దిగొచ్చింది. ఈ పొరపాటుపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి సంస్థ గ్లోబల్ చీఫ్ ఆఫీసర్ జోయల్ కాప్లాన్ నేరుగా క్షమాపణలు చెప్పారు.

"ప్రధాని మోదీ పోస్ట్‌ను పొరపాటున నిలిపివేసినందుకు మెటా తరఫున కేంద్ర మంత్రికి క్షమాపణలు తెలియజేశాను" అని జోయల్ కాప్లాన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ జులై 28న ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి చేసిన వీడియో పోస్ట్ అర్ధరాత్రి 12:30 గంటల నుంచి ఉదయం 5:30 గంటల వరకు ఫేస్‌బుక్‌లో కనిపించకుండా పోయింది. దీనిపై పార్లమెంటరీ ఐటీ కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్రంగా స్పందించారు. మెటా అధిన...