భారతదేశం, ఏప్రిల్ 21 -- దేశ రాజకీయాల్లో మంగళవారం ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి దారితీశాయి. ప్రధానిని ఉద్దేశించి ఆయన 'టెర్రరిస్ట్' అనే పదాన్ని వాడటంతో పాటు, తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో జతకట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి.

తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే తీరును ఖర్గే ఎండగట్టారు. "అన్నాదురై వంటి గొప్ప నేతల ఫోటోలను పెట్టుకునే అన్నాడీఎంకే నేతలు మోదీతో ఎలా కలుస్తారు? ఆయన ఒక ఉగ్రవాది. ఆయన పార్టీకి సమానత్వం, న్యాయంపై అస్సలు నమ్మకం లేదు. అటువంటి వారితో చేతులు కలపడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే" అని ఖర్గే నిప్పులు చెరిగారు. తమిళనాడు ప్రయ...