భారతదేశం, జూలై 13 -- యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో ఒక వినూత్నమైన మోసం వెలుగుచూసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సిబ్బందిగా నటిస్తూ వచ్చిన ఇద్దరు కేటుగాళ్లు ఒక మహిళకు చెందిన బంగారు మంగళసూత్రాన్ని దొంగిలించి పరారయ్యారు.

నివేదికల ప్రకారం బీబీనగర్ మండలానికి చెందిన కె.అండాలు అనే మహిళ ఇంటికి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చారు. తాము 'SIR' సర్వే కోసం వచ్చామని, ఆమె ఫోటోలు తీసుకోవాలని నమ్మించారు. అయితే ఫోటో తీసేటప్పుడు మెడలోని మంగళసూత్రం కనిపించకూడదని, కాబట్టి దాన్ని తీసేయాలని ఆమెకు చెప్పారు.

నిజమేనని నమ్మిన అండాలు తన మెడలోని మంగళసూత్రాన్ని తీసి, ఇంటి బయటే నిలబడి ఉన్న తన భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత సదరు నిందితులు ఆమెను కొన్ని ఫోటోలు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా తదుపరి ప్రక్రియ కోసం సమీపంలోని గుడికి రావాలని ఆమెను కోరారు.

బ...