భారతదేశం, జూలై 19 -- హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తోటి మహిళా ఐపీఎస్ ట్రైనీ ఆఫీసర్‌ను లైంగికంగా వేధించడంతో పాటు చంపేస్తానని బెదిరించిన ఆరోపణలపై ఒక ఐపీఎస్ ట్రైనీపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణ రెడ్డి అనే ఐపీఎస్ ట్రైనీపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. గత కొన్ని వారాలుగా నిందితుడు తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నట్లు సదరు ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి తన ఫిర్యాదులో పేర్కొ్న్నారు. జూన్ 23వ తేదీ నుండి ఈ వేధింపుల పర్వం మొదలైందని, రోజురోజుకూ నిందితుడి ప్రవర్తన మితిమీరిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితురాలు పోలీసులకు త...