భారతదేశం, మార్చి 7 -- అమెరికా, ఇజ్రాయెల్‌లతో భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఇరాన్ వ్యూహాత్మక అడుగు వేసింది. పొరుగు దేశాలతో అనవసర శత్రుత్వాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి ప్రాంతీయ దేశాలపై జరిగిన దాడులకు ఆయన క్షమాపణలు చెప్పారు.

గత వారం అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన 'మధ్యంతర నాయకత్వ మండలి' (Interim Leadership Council) పొరుగు దేశాల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది.

"పొరుగు దేశాలపై దాడులు చేయకూడదని, క్షిపణులు ప్రయోగించకూడదని నిర్ణయించాం. అయితే, ఆ దేశాల భూభాగం నుంచి ఇరాన్‌పై దాడులు జరిగితే మాత్రం మేము ఊరుక...