భారతదేశం, ఏప్రిల్ 23 -- భారతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గురువారం భారీగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా వెండి కొనుగోలుదారులకు ఇది ఊరటనిచ్చే విషయమే అయినా, ఇన్వెస్టర్లలో మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ద్రవ్యోల్బణం పెరిగి, వడ్డీ రేట్ల తగ్గింపు మరింత ఆలస్యం కావచ్చనే సంకేతాలే ఈ పతనానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

దేశీయ కమోడిటీ మార్కెట్ (MCX)లో వెండి ధరలు భారీగా కుంగాయి. కిలో వెండిపై ఏకంగా 2.5 శాతం అంటే సుమారు రూ. 6,100 మేర తగ్గి, రూ. 2,42,220 వద్ద ట్రేడవుతోంది. అటు పసిడి ప్రేమికులకు కూడా స్వల్ప ఊరట లభించింది. 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1,000 (0.6%) తగ్గి రూ. 1,51,719 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్పాట్ సిల్వర్ ధర 1.4 శాతం తగ...