భారతదేశం, మార్చి 7 -- పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో, భారత్లో ఇంధన కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న వివిధ వార్తలతో ప్రజలు పెట్రోల్ బంకుల వద్దకు క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) రంగంలోకి దిగింది.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరుతూ బిపిసిఎల్ తన వినియోగదారులకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎస్ఎంఎస్ అలర్ట్లను పంపింది.
"ప్రియమైన వినియోగదారులారా, సోషల్ మీడియాలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. అవి పూర్తిగా అవాస్తవం. దేశంలో తగినంత ఇంధనం అందుబాటులో ఉంది. పౌరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, ఇంధనాన్ని పొదుపు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.